యాప్నగరం

YS Sharmila: నేనంటే నాన్నకు ప్రాణం.. తండ్రిని తలుచుకొని కన్నీరు పెట్టిన షర్మిల

YS Sharmila: తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో వైఎస్ షర్మిల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన ఘటన, ఆ తర్వాత హైదరాబాద్‌లో షర్మిలపై కేసులు పెట్టడం, ఆ వెంటనే కోర్టు బెయిల్ మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ సమయంలో వైఎస్ షర్మిల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తల్చుకొని కన్నీరు పెట్టారు. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని విషయాలను ఆమె వెల్లడించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 30 Nov 2022, 11:35 pm

ప్రధానాంశాలు:

  • తండ్రిని తల్చుకొని కన్నీరు పెట్టిన వైఎస్ షర్మిల
  • నాన్నంటే తనకు ప్రాణం అని చెప్పిన షర్మిల
  • ఇంకా కొంత కాలం బతికి ఉంటే బాగుండేదని వ్యాఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sharmila
షర్మిల
YS Sharmila: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో షర్మిలను పోలీసులు అరెస్టు చేసి.. హైదరాబాద్ తరలించారు. ఈ సమయంలో.. షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయస్థానం షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పాదయాత్రకు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో షర్మిల పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన తండ్రిని తల్చుకొని కన్నీరు పెట్టారు.
'నేనంటే నాన్నకు ప్రాణం. నాన్నంటే నాకు అంతే. అసలు రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే.. కోట్ల మంది ప్రజల బతుకులు బాగుపడేవి. అది చాలాచాలా బాధాకరం. ఇంకా కొంత కాలం బతికి ఉన్నా కూడా.. ఎంతోమంది జీవితాలు మారిపోయేవి. ప్రతీదాంట్లో లోటు ఉంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఎంత గొప్ప మనసు.. ఎంత పెద్ద మనిషి. అలాంటి రాజశేఖర్ రెడ్డి పాలన తెలంగాణ ప్రజలకు మళ్లీ అందించాలని సంకల్పించా. ఇంత మంది ప్రేమించారు. ఇంత మంది చనిపోయారు. వీళ్లకోసం మనం ఇది చేయలేమా అని నా గుండెల మీద నాన్న ఒక విల్లు రాసినట్టు అనిపించింది' వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.