యాప్నగరం

వైఎస్ సునీతారెడ్డి మరో ఊహించని ట్విస్ట్.. అన్నంత పనిచేశారుగా, ఊహించని విధంగా

Ys Sunitha Reddy Petition In Supreme Court వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ ఎపిసోడ్ ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించారు వైఎస్ సునీతారెడ్డి. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరగా.. శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటూ ఉదయ్ కుమార్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 20 Apr 2023, 12:55 pm

ప్రధానాంశాలు:

  • సుప్రీంకోర్టులో వైఎస్ సునీతారెడ్డి పిటిషన్
  • అవినాష్ రెడ్డి బెయిల్‌ను సవాల్ చేశారు
  • శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ys Sunitha Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Ys Vivekananda Reddy Murder Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవలే రంగంలోకి దిగిన సీబీఐ టీమ్ దర్యాప్తు చేస్తోంది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో మలుపు తిరిగింది. వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎంపీ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy) మధ్యంతర బెయిల్‌ను సవాల్ చేశారు.. అత్యవసరంగా విచారణ చేయాలని కోరారు. సునీత పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు.. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించగా.. శుక్రవారం విచారణ చేస్తామని తెలిపారు.
ఇటు వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టైన వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి (YS bhaskar Reddy),గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి (Gajjala Udaykumar Reddy)లు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని ప్రస్తావించారు. అలాగే తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి పిటిషన్‌లో కోరారు. సీబీఐ దగ్గర వివేకాను తామే హత్య చేశామనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేవలం గూగుల్ టేక్ ఆవుట్ లొకేషన్ ఆధారంగా సీబీఐ అరెస్ట్ చెయ్యడం సరికాదన్నారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించనుంది.
అంతేకాదు సీబీఐ కస్టడీలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కస్టడీ విచారణలో సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు పాటించాలని తేల్చి చెప్పింది. అలాగే మధ్యాహ్నం రెండు గంటల వరకే లాయర్‌ను అనుమతించాలన్న ఆదేశాలను సవరించి.. సాయంత్రం 5 గంటల వరకు అనుమతించింది. విచారణ సమయంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని సూచించింది.

మరోవైపు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు తెలంగాణ హైకోర్టు అరెస్ట్ చేయొద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణకు అవినాష్ సహకరించాలని.. సీబీఐ అధికారుల ప్రశ్నలకు లికితపూర్వకంగా సమాధానం అందజేయాలని సూచించారు. ఈ నెల 25 వరకు సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అవినాష్ విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.