యాప్నగరం

వైఎస్ వివేకా హత్య కేసు: కడప ఎస్పీ వార్నింగ్!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వదంతులను నమ్మొద్దు. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవాస్తవాలను ప్రచురించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప ఎస్పీ హెచ్చరించారు.

Samayam Telugu 13 Oct 2019, 4:26 pm
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అనేక మలుపులు తిరుగుతోంది. హత్య జరిగి ఆరు నెలలు కావొస్తున్నా నేటికీ నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. హత్య కేసు నిందితులెవరో సీఎం జగన్‌కి తెలుసని, కావాలనే ఆయన బయటకు రానీయడం లేదని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.
Samayam Telugu vivekananda-reddy


ఇంతలోనే ఆ కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్న కోణంలో పోలీసులు ఆరా తీయడంతో షాకింగ్ నిజాలు తెలిసినట్లు ప్రచారం జరిగింది. వివేకాను హత్య చేసేందుకు ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్‌కి సుపారీ ఇచ్చినట్లు.. సునీల్ గ్యాంగ్‌తో శ్రీనివాసరెడ్డి సంప్రదింపులు జరిపినట్లు పోలీసులకు తెలిసిందని వార్తలు కూడా వచ్చాయి.

Also Read: అప్పుడు ఎన్టీఆర్‌ది.. ఇప్పుడు వైఎస్సార్ వంతు..

సుపారీ ఇచ్చి వైఎస్ వివేకాను హత్య చేయించారని, సునీల్ గ్యాంగ్‌తో శ్రీనివాసరెడ్డి సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని కడప ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. హత్యకేసు విచారణలో ఉందని, ఎవరైనా అలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.