యాప్నగరం

‘చంద్రబాబు కుటుంబాన్ని చంపేందుకు భారీ కుట్ర’

చంద్రబాబు కుటుంబాన్ని అంతమొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో వైసీపీ కార్యకర్తలు కుట్ర పన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.

Samayam Telugu 4 Mar 2020, 3:58 pm
టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సహా ఆయన కుటుంబ సభ్యులను అంతమొందించేందుకు అధికార వైసీపీ కుట్రలు పన్నుతోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఇటీవలే విశాఖపట్నంలో చంద్రబాబునాయుడు, మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో నారా లోకేష్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటివి చేస్తే పోలీసులకు బాధ్యత లేదా అని ఆయన డీజీపీని ప్రశ్నించారు. చంద్రబాబు, లేకేష్‌ను లేకుండా చేస్తే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu pjimage (42)


రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, అందులో భాగంగానే కలియుగ అభిమన్యుడు వంటి లోకేష్‌పై 1,000 మంది వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. పోలీసులు, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పక్కనపెట్టి, కేసులు పెట్టకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, లోకేశ్‌కు భద్రత తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అంత భద్రత అవసరమా అని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.