యాప్నగరం

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులుగా నలుగురు ఖరారు.. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్యల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 17 May 2022, 10:16 pm

ప్రధానాంశాలు:

  • వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు
  • తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చారు
  • బీద మస్తాన్‌రావుకు ఛాన్స్ ఇచ్చిన వైసీపీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu వైసీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులు ఖరారయ్యారు. రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్యల పేర్లను ప్రకటించారు. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్‌. కృష్ణయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ నలుగురి పేర్లను ప్రకటించారు.
ఈ నలుగురిలో విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించగా.. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన బీద మస్తాన్‌రావుకు ఛాన్స్ ఇచ్చారు. ఇక మిగిలిన ఇద్దరిలో నిరంజన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్యలది తెలంగాణ.. నిరంజన్ రెడ్డి సుప్రీం కోర్టు లాయర్.. ఆయనది నిర్మల్ జిల్లా. ఆర్‌.కృష్ణయ్య బీసీల జాతీయ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
కృష్ణయ్య బీసీల గొంతుకగా ఉన్నారని.. అందుకే ఆయనకు అవకాశం కల్పించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయనది తెలంగాణనా, ఆంధ్రనా అన్నది ముఖ్యం కాదని.. బీసీల గళాన్ని రాజ్యసభలో వినిపించాలనే ఉద్దేశంతోనే కృష్ణయ్యను ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు. రాజ్యసభకు ఏపీ, తెలంగాణ అనే తేడా లేదని.. ఆయన బీసీలకు సింబల్‌గా ఉన్నారన్నారు బొత్స.
అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ విషయంలో బీసీలకు పెద్దపీట వేశారన్నారు వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆదరణ కింద పరికరాలు ఇవ్వడం కాదు.. బీసీలను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం ముఖ్యమన్నారు. రాజ్యసభలో మహిళలకు ప్రాతినిధ్యం త్వరలో లభిస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ బీసీలకు ఇలాంటి అవకాశం ఇవ్వలేదని.. నాలుగులో సగం స్థానాలు బలహీనవర్గాలకే ఇచ్చామన్నారు.
ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్‌ పోస్టులైనా వైఎస్సార్‌సీపీది ఒకటే దారి.. జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నాము అన్నారు. . గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని.. బీసీల పట్ల చిత్తశుద్ధిని వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోందన్నారు.

వైఎస్సార్‌సీపీకి ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని బట్టి ఈ నాలుగు రాజ్యసభ సీట్లు వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడనున్నాయి.. ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగుర్ని కలిపితే 9కి బలం పెరిగింది. జూన్ 10న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక టీడీపీకి ఒకే ఒక్క ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.