యాప్నగరం

మంత్రి బొత్స సత్యనారాయణకు షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు

అనంతపురం జిల్లాలో మంత్రి బొత్స నారాయణను వైసీసీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

Samayam Telugu 23 Nov 2020, 6:00 pm
Samayam Telugu మంత్రి బొత్సను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రచ్చకెక్కింది. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత పార్టీ నాయకులే షాకిచ్చారు. మంత్రి బొత్స కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు మహిళా కార్యకర్తలు మంత్రి బొత్స దృష్టికి తీసుకువెళ్లారు.

నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు సైతం నిరసనకు దిగారు. కాగా, నియోజకవర్గంలో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ వర్గాల మధ్య వర్గపోరు నెలకొంది. ఇందులో భాగంగానే ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు.

ఎమ్మెల్యే ఉషాశ్రీపై రంగయ్య వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఇక, నిరసనల మధ్యే రాయదుర్గం నియోజకవర్గంలో సైతం మంత్రి బొత్స పర్యటన కొనసాగింది. ఎక్కడికక్కడ తమ సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.