మంత్రి బొత్స సత్యనారాయణకు షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు
అనంతపురం జిల్లాలో మంత్రి బొత్స నారాయణను వైసీసీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
Samayam Telugu 23 Nov 2020, 6:00 pm
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రచ్చకెక్కింది. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత పార్టీ నాయకులే షాకిచ్చారు. మంత్రి బొత్స కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు మహిళా కార్యకర్తలు మంత్రి బొత్స దృష్టికి తీసుకువెళ్లారు.
నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు సైతం నిరసనకు దిగారు. కాగా, నియోజకవర్గంలో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ వర్గాల మధ్య వర్గపోరు నెలకొంది. ఇందులో భాగంగానే ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు.
ఎమ్మెల్యే ఉషాశ్రీపై రంగయ్య వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఇక, నిరసనల మధ్యే రాయదుర్గం నియోజకవర్గంలో సైతం మంత్రి బొత్స పర్యటన కొనసాగింది. ఎక్కడికక్కడ తమ సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు.
నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు సైతం నిరసనకు దిగారు. కాగా, నియోజకవర్గంలో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ వర్గాల మధ్య వర్గపోరు నెలకొంది. ఇందులో భాగంగానే ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు.
ఎమ్మెల్యే ఉషాశ్రీపై రంగయ్య వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఇక, నిరసనల మధ్యే రాయదుర్గం నియోజకవర్గంలో సైతం మంత్రి బొత్స పర్యటన కొనసాగింది. ఎక్కడికక్కడ తమ సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు.