యాప్నగరం

వైసీపీ పదేళ్ల ప్రస్థానం.. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి గురువారం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Samayam Telugu 11 Mar 2020, 10:18 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబ సభ్యులకు, ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Samayam Telugu pjimage (90)


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ పార్టీని స్థాపించారు. ఓవైపు ఆనాటి కాంగ్రెస్ పార్టీ హయాంలో చుట్టుముట్టిన అవినీతి కేసులు, 16 నెలల జైలు జీవితం అనుభవించిన తర్వాత కూడా జగన్ మొండి పట్టుదలతో ముందుకు సాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగి ఏపీలో 67 అసెంబ్లీ స్థానాలు సాధించి బలమైన ప్రతిపక్ష నేతగా ఎదిగారు.

తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేసి, రాష్ట్ర ప్రజలలో మమేకం అయిన వైఎస్‌ జగన్‌కు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనం బ్రహ్మరథం పట్టారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నాయత్వంలోని వైఎస్సార్‌‌సీపీ 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.