యాప్నగరం

YSRCP లో టాప్ 3 వీరేనా.. ఆ ముగ్గురికి సీఎం జగన్ కీలక పదవులు

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాప్ 3 ఎవరో ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Samayam Telugu 1 Jul 2020, 8:02 pm
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాప్ 3 ఎవరనే దానిపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరోక్షంగా చెప్పేశారా? పార్టీలో సెకండ్ పొజిషన్ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చేశారా? వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీలో కీలక నియామకాలు చేపట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి వైఎస్ జగన్ కీలక నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారు.
Samayam Telugu సీఎం జగన్

ఇందులో భాగంగా వైసీపీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల బాధ్యతలను రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. అలాగే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తారు.

అలాగే తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.