యాప్నగరం

YS Jagan చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్‌ ప్రారంభోత్సవం

ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రీయ కార్యాలయం ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తారు.

Samayam Telugu 9 Aug 2019, 9:58 pm
అమరావతి: తాడేపల్లిలో సీఎం నివాసం సమీపంలో నిర్మించిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ భవనాన్ని శనివారం ఉదయం ప్రారంభించనున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్య నేతలు తాడేపల్లికి వచ్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త ఆఫీసులో అన్ని హంగులు ఏర్పాటు చేశారు. బ్యాక్ ఆఫీసు, సోషల్ మీడియా విభాగం, మీడియా కోఆర్డినేషన్ ఇలా పార్టీకి చెందిన విభాగాలన్నీ ఇక్కడి నుంచే పని చేస్తాయి.
Samayam Telugu ysrcp office2


హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నుంచి పార్టీ కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేశాక, తాడేపల్లిలోని సీఎం నివాసంలోనే పార్టీ కొత్త ఆఫీస్ ఉంటుందని భావించారు. కానీ దాన్ని క్యాంప్ ఆఫీసుగా ఉపయోగిస్తున్నారు. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయంగా ప్రత్యేకంగా ఆఫీసును ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు.

అధినేత ఆదేశాలతో అప్పటికే పార్టీ ఆఫీస్ భవనం కోసం నాయకులు వెతుకులాట ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన భవనం నిర్మాణంలో ఉండటంతో.. ఆయన్ను ఒప్పించి దాన్ని పార్టీ ఆఫీసుగా మార్చేశారు. చుట్టూ అద్దాలతో, పచ్చదనంతో కూడిన ఈ భవనం ఆకట్టుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.