యాప్నగరం

కేంద్ర బడ్జెట్‌పై వైస్సార్‌సీపీ డైరెక్ట్ అటాక్.. ‘ఇంత పక్షపాతమా’?

పక్షపాత ధోరణితో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపడం మంచిది కాదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీలు పెదవి విరిచారు.

Samayam Telugu 1 Feb 2020, 3:27 pm
కేంద్ర బడ్జెట్‌ తమకు తీవ్ర నిరాశ కలిగించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడ్డ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ బడ్జెట్‌ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం అనంతరం ఆయన శనివారం పార్లమెంట్‌ ఆవరణలో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు.
Samayam Telugu vsr


డిపాజిటర్ల బీమా రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచడం మంచి పరిణామమని విజయసాయి తెలిపారు. అయితే ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని స్పష్టం చేశారు. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇ‍వ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారని, అయితే ఆ విధానంలో స్పష్టత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

అలాగే రాష్ట్రానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు. నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపించిందని విమర్శించారు. పక్షపాత ధోరణితో రాష్ట్రం పట్ల వివక్ష చూపడం మంచిది కాదన్నారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు అసలే లేవని పెదవి విరిచారు. రాష్ట్రానికి ఒక్క రైల్వే ప్రాజెక్ట్‌ కూడా ఇవ్వలేదన్నారు. ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను కనీసం ప్రస్తావించలేదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.