యాప్నగరం

YSRCP: వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం.. మీ అభిమానం సల్లగుండ

ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసి.. ఘనంగా సన్మానించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, మైనార్టీలు. NPRకు వ్యతిరేకంగా కేబినెట్‌లో తీర్మానం చేయడంతో పాటూ.. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆనందం.

Samayam Telugu 4 Mar 2020, 7:40 pm
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అభిమానులు, ముస్లింలు పాలాభిషేకం చేశారు. అనంతరం ముస్లిం సంప్రదాయ అలంకరణలో ఎమ్మెల్యే కోటంరెడ్డిని సత్కరించారు. NPRకు వ్యతిరేకంగా కేబినెట్‌లో తీర్మానం చేయడంతో పాటూ.. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో మైనార్టీలు తమ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు.
Samayam Telugu sridhar


అంతకముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి.. తన కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో కలసి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్. జగన్ చిత్రపటాలకు పాలాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. NPRపై ప్రేరణ ఇచ్చిన గాంధీనగర్ ముస్లిం మైనారిటీ మహిళలకు ఎప్పుడు రుణపడి ఉంటాను అన్నారు శ్రీధర్‌రెడ్డి. ముస్లిం మైనార్టీల మనోభావాలను, భయాలను తొలగించేందుకు రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తిగా ఈ పోరాటంలో అందరికంటే ముందుగా ఒక అడుగు ముందుకు వేసాను అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ అండదండతో, మంత్రి అనిల్ కుమార్ సహకారంతో NPR పోరాటం ఫలించిందన్నారు కోటంరెడ్డి శ్రీధర్2రెడ్డి. NPR ఉద్యమంలో తనను నమ్మి, తన వెంట నడిచిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటాను అన్నారు. శ్రీధర్ రెడ్డి ఇటీవల నెల్లూరులో NPRకు వ్యతిరేకంగా భారీ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.