యాప్నగరం

Chandrababu Naidu కనిపించడం లేదు.. పోలీసులు ఆచూకీ కనిపెట్టాలంటూ

చంద్రబాబు కనిపించడం లేదు.. ఆయన జాడ కనిపెట్టాలంటూ కుప్పం పోలీసులకు ఫిర్యాదు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి తమ ఎమ్మెల్యే కుప్పం రాలేదంటున్న వైసీపీ నేతలు.

Samayam Telugu 24 Dec 2019, 1:21 pm
మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కనిపించడం లేదు.. ఆయన్ను వెతికి పెట్టండి అంటున్నారు వైఎస్సార్‌సీపీ నేతలు. మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ కేడర్.. కుప్పంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే చంద్రబాబు ఎక్కడ ఉన్నారో.. జాడ కనిపెట్టాలని వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గానికి రాలేదంటున్నారు.
Samayam Telugu babu


Read Also: మా ఎమ్మెల్యే శ్రీదేవిని వెతికిపెట్టండి.. పోలీసులకు మహిళల ఫిర్యాదు

అమరావతి రైతుల బాటలోనే కుప్పం వైఎస్సార్‌సీపీ నేతలు వెళుతున్నారు. రెండు రోజులుగా రైతులు మంగళగిరి, తాడికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు కూడా సోమవారమే అమరావతిలో పర్యటించారు. మూడు రాజధానుల ప్రకటన, జీఎన్ రావు కమిటీ నివేదికకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. రైతులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. టీడీపీ నేతలు కూడా ఈ ఆందోళనలకు సంఘీభావం తెలియజేశారు.

ఈ తాజా పరిణామాలకు కౌంటర్‌గా వైఎస్సార్‌‌సీపీ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే.. తమ ఎమ్మెల్యే చంద్రబాబు జాడ కనిపెట్టాలని కుప్పం పోలీసులకు వినతి పత్రం అందించారు. ఇప్పుడు అదే ఫార్ములాతో చంద్రబాబు కనిపించడం లేదంటూ వైఎస్సార్‌సీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.