యాప్నగరం

నిమ్మగడ్డ రమేష్‌కు జగన్ సర్కారు షాక్.. పంచాయతీ ఎన్నికలపై ఊహించని ట్విస్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివాదం క్షణంక్షణం ఉత్కంఠభరితంగా మారుతోంది. తాజాగా..

Samayam Telugu 9 Jan 2021, 4:49 pm
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో గంటగంటకీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని, ఎలక్షన్స్ వాయిదా వేయాలని శుక్రవారం జగన్ ప్రభుత్వం కోరిన గంటల్లోనే నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏకంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూలును శుక్రవారం రాత్రి ప్రకటించారు.
Samayam Telugu నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎం జగన్


ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటనపై వైసీపీ ప్రభుత్వం భగ్గుమంది. రాష్ట్ర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ ఈసీ నిమ్మగడ్డపై ఫైరవుతున్నారు. ఈ తరుణంలో నిమ్మగడ్డ రమేష్‌కు జగన్ ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల ప్రకటనపై వైసీపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ నెల 8 నుంచి నుంచి 12 వరకు ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 12 తర్వాత వరుసగా ప్రభుత్వ సెలవులు కావడంతో హైకోర్టు ఈ నెల 18న పునః ప్రారంభమవుతుంది.

అయితే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం, శనివారం నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో జగన్ సర్కారు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసర పిటిషన్‌గా పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.