యాప్నగరం

నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ శుభవార్త

Ysr Adarsham: నిరుద్యోగ యువత కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం. వైఎస్సార్‌ ఆదర్శం పేరుతో నిరుద్యోగ యువతకు వాహనాలు మంజూరు చేయాలని నిర్ణయం. ఆరు వేల వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు.

Samayam Telugu 22 Oct 2019, 1:11 pm
పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నవరత్నాలతో పాటూ సరికొత్త పథకాలు, సంచలన నిర్ణయాలతో దూసుకెళుతున్నారు. ప్రజలు, యువత, మహిళలు ఇలా అందరికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu cm


Read Also: అమిత్ షాతో జగన్ భేటీ.. మధ్యాహ్నం మరో ఇద్దరు కేంద్రమంత్రులతో..

వైఎస్సార్ ఆదర్శం పేరుతో నిరుద్యోగ యువతకు వాహనాలు అందజేయాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. దాదాపు 6వేల వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు విడుదల చేశారు. వివిధ బ్యాంకుల రుణాల ద్వార నిరుద్యోగ యువతకు వాహనాలు మంజూరు చేయనున్నారు.

ఈ వైఎస్సార్ ఆదర్శం పథకానికి సంబంధించి పారదర్శకత కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీల పర్యవేక్షణలో అర్హుల ఎంపిక, రుణాల మంజూరు చేయాలని నిర్ణయించారు. సాంఘిక సంక్షేమ కార్యదర్శి నేతృత్వంలో 8మంది సభ్యుల కమిటీ.. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల్లో ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే విధి విధానాలను కూడా ఖరార్ చేసేందుకు సిద్దమవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.