యాప్నగరం

సీఏఏ, ఎన్ఆర్‌సీకి మద్దతిచ్చేది లేదు.. అభద్రతలో ముస్లింలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

సీఏఏ, ఎన్ఆర్‌సీ వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చేది లేదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తున్నారని ముస్లింలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 25 Jan 2020, 5:57 pm
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌర సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) బిల్లులకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పునరుద్ఘాటించారు. శనివారం అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో జరిగిన మైనార్టీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంజాద్ బాషా మాట్లాడారు.
Samayam Telugu BASHA


దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తున్నారని.. తమ పౌరసత్వానికే ముప్పు ఉందని ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని మంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్‌సీ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముస్లింలకు అన్ని వేళలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని చెప్పారు.

అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మించింది కేవలం తాత్కాలిక రాజధాని మాత్రమే అని స్పష్టం చేశారు. ఏపీలోని అన్ని జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని వివరించారు. సీఎం జగన్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని అంజాద్‌ బాషా పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.