వైసీపీ ప్రభుత్వం టీడీపీకి మరోసారి షాకిచ్చింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సెలెక్ట్ కమిటీ ఫైల్ను శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపింది. దీంతో మళ్లీ శానస మండలి చైర్మన్ వద్దకు ఫైలు చేరింది. రూల్ 154 కింద కమిటీ వేయడం చెల్లదని ఫైలు మీద రాసినట్లు తెలుస్తోంది. అయితే చైర్మన్ నుంచి ఫైలు వచ్చిన వెంటనే కమిటీ వేయని పక్షంలో ఈ సారి మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఉదయం నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సోమవారం మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, నాగజగదీష్, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు తదితరులు కలిశారు. సెలక్ట్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి చైర్మన్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శిని కోరారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. శాసనమండలి సెక్రటరీని ప్రభుత్వ పెద్దలు బెదిరించారని ఆరోపించారు. మండలి సెక్రటరీని కలిసినప్పుడు ఆయనలో ఆందోళన, భయం కనిపించిందని తెలిపారు. ఆ కారణంగానే మండలి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను సెక్రటరీ పక్కన పెట్టారని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం మండలి చైర్మన్ షరీఫ్కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలెక్ట్ కమిటీలో తాము ఉండబోమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని అధికారపార్టీకి చెందిన నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలు రాశారు. తాజాగా, సెలెక్ట్ కమిటీ ఫైల్ను చైర్మణ్ షరీఫ్కు తిప్పి పంపి వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా టీడీపీని దెబ్బకొట్టింది.
ఈ నేపథ్యంలో సోమవారం మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, నాగజగదీష్, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు తదితరులు కలిశారు. సెలక్ట్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి చైర్మన్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శిని కోరారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. శాసనమండలి సెక్రటరీని ప్రభుత్వ పెద్దలు బెదిరించారని ఆరోపించారు. మండలి సెక్రటరీని కలిసినప్పుడు ఆయనలో ఆందోళన, భయం కనిపించిందని తెలిపారు. ఆ కారణంగానే మండలి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను సెక్రటరీ పక్కన పెట్టారని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం మండలి చైర్మన్ షరీఫ్కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలెక్ట్ కమిటీలో తాము ఉండబోమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని అధికారపార్టీకి చెందిన నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలు రాశారు. తాజాగా, సెలెక్ట్ కమిటీ ఫైల్ను చైర్మణ్ షరీఫ్కు తిప్పి పంపి వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా టీడీపీని దెబ్బకొట్టింది.