YSRCP కి దిమ్మతిరిగే షాక్: టీడీపీలోకి కీలక నేత.. ఫుల్ జోష్లో లోకేష్
Nara Lokesh: తెలుగుదేశం పార్టీలో లోకేష్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ నాయకుడు చేరారు.
Samayam Telugu 10 Dec 2020, 11:51 am
ప్రతిపక్ష పార్టీల నాయకులంతా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న తరుణంలో శుక్రవారం తెలుగు దేశం పార్టీలో జోష్ నిండింది. వైసీపీ నాయకుడు, సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట్ల మధుబాబు నాయుడు టీడీపీలో చేరారు. శుక్రవారం అమరావతిలో మధుబాబుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మధుబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు, మాలేపాటి సుబ్బానాయుడు, మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర, బొట్లగుంట శ్రీహరి నాయుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిన వారిలో కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు. ఇది ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.
అలాగే వైసీపీ నేతల చేరికలు నారా లోకేష్లో ఫుల్ జోష్ నింపింది. ఈ మేరకు లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, వైసీపీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని చెప్పారు. ‘‘రాష్ట్రంలో మార్పు మెల్లగా మొదలవుతోంది. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా అసమ్మతి తెలుపుతున్నారు.
ఈరోజు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గ వైకాపా నేత కర్లగుంట మధుబాబు నాయుడు గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరాను. ప్రజా సమస్యలపై పోరాటానికి ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చాను.’’ అని లోకేష్ పేర్కొన్నారు.
Don't Miss: నిమ్మగడ్డ రమేష్కు జగన్ సర్కారు ఊహించని షాక్.. ఈసారి ఏకంగా అసెంబ్లీలో!
Must Read: పవన్ కళ్యాణ్ను పక్కనపెట్టిన బండి సంజయ్: వాడుకుని వదిలేస్తారా.. రగిలిపోతున్న జనసైనికులు
ఈరోజు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గ వైకాపా నేత కర్లగుంట మధుబాబు నాయుడు గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరాను. ప్రజా సమస్యలపై పోరాటానికి ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చాను.’’ అని లోకేష్ పేర్కొన్నారు.
Don't Miss: నిమ్మగడ్డ రమేష్కు జగన్ సర్కారు ఊహించని షాక్.. ఈసారి ఏకంగా అసెంబ్లీలో!
Must Read: పవన్ కళ్యాణ్ను పక్కనపెట్టిన బండి సంజయ్: వాడుకుని వదిలేస్తారా.. రగిలిపోతున్న జనసైనికులు