యాప్నగరం

ఢిల్లీ: బీజేపీ ఆఫీసులో ప్రత్యక్షమైన అలీ

ఢిల్లీలో బీజేపీ ఆఫీసుకు వెళ్లిన నటుడు అలీ.. పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం. అసలు విషయం చెప్పుకొచ్చిన కమెడియన్. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరిన అలీ.

Samayam Telugu 24 Jan 2020, 1:51 pm
టాలీవుడ్ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత అలీ ఢిల్లీలో ఉన్న బీజేపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. అలీ ఉన్నట్టుండి బీజేపీ కార్యాలయానికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై మీడియా ఆరా తీయగా.. వ్యక్తిగతమైన పనిమీద వచ్చానని చెప్పుకొచ్చారట. ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలో భారత్‌కు రాబోతున్నారని.. ఆయన ప్రధాని మోదీని కలవాలని భావిస్తున్నారని.. ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి అపాయింట్‌మెంట్ గురించి చర్చించానని.. ఆయన సైతం సానుకూలంగా స్పందించారని చెప్పారు.
Samayam Telugu ali.


అలీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది.. ఆ తర్వాత పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. అలీ వైఎస్సార్‌సీపీ నేత హోదాలో పెద్దగా మీడియా ముందుకు రాలేదు. అంతేకాదు ఆయనకు నామినేటెడ్ పదవి కట్టబెడతారనే ప్రచారం జరిగింది.. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఆయన బీజేపీ ఆఫీసుకు వెళ్లడం ఆసక్తికరంగా మారగా.. ఆయన వివరణ ఇవ్వడంతో ప్రచారానికి తెరపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.