యాప్నగరం

నారా ఫ్యామిలీ బినామీ ఆస్తులను కూడా ప్రకటించాలి: గడికోట శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు నాయుడు ఆస్తుల ప్రకటనపై గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. లోకేశ్ హడావుడిగా ఆస్తులను ప్రకటించడానికి కారణం ఐటీ విచారణలో వాస్తవాలు బయటకు రావడమేనన్నారు.

Samayam Telugu 20 Feb 2020, 6:43 pm
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులను ఆయన కుమారుడు నారా లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. తమను విమర్శించడం కాదు.. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా తమ ఆస్తులను ప్రకటించారని సవాల్ విసిరారు. లోకేశ్ ఆస్తులను ప్రకటించిన కాసేపటికే వైఎస్సార్సీపీ దాడి మొదలుపెట్టింది. చంద్రబాబు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Samayam Telugu babu


గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో.. మీడియాతో మాట్లాడిన గడికోట శ్రీకాంత్ రెడ్డి.. హడావుడిగా లోకేశ్ ఆస్తులను ప్రకటించడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఐటీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయనే కారణంతో ఆస్తులు ప్రకటించారని విమర్శించారు.

అహ్మద్ పటేల్‌కు కూడా డబ్బులు పంపించారని వార్తలొస్తున్న తరుణంలో లోకేశ్ తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. నారా ఫ్యామిలీకి ఉన్న బినామీ ఆస్తులను కూడా ప్రకటిస్తే అప్పుడు నిజం తెలుస్తుందని ఆయన లోకేశ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాబు అవినీతి బాగోతం దేశం మొత్తానికి తెలిసిపోయిందన్నారు.

చంద్రబాబు పీఎస్‌ ఇంట్లోనే దాడులు చేస్తే.. రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బాబు రూ.7 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విదేశాల్లో ఉన్న ఆయన బినామీ ఆస్తులను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.