యాప్నగరం

TDP చీఫ్ చంద్రబాబును కలిసిన జయసుధ

YSRCP నాయకురాలు జయసుధ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. తన కుమారుడి వివాహానికి ఆయన్ను ఆహ్వానించారు. జయసుధతోపాటు ఆమె సోదరి కూడా బాబును కలిశారు.

Samayam Telugu 17 Feb 2020, 3:05 pm
వైఎస్సార్సీపీ మహిళా నేత, సినీ నటి జయసుధ మాజీ సీఎం చంద్రబాబు నాయుడ్ని కలిశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆమె.. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. తప్పనిసరిగా తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని ఆమె కోరారు. జయసుధ వెంట ఆమె సోదరి సుభాషిణి కూడా బాబు నివాసానికి వెళ్లారు. జయసుధకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ అని ఇద్దరు కుమారులున్నారు. ఫిబ్రవరి 26న నిహార్ కపూర్ ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్‌ను వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఆమె భర్త నితిన్ కపూర్ 2017లో చనిపోయారు.
Samayam Telugu babu jayasudha


వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పని చేశారు. చాలా కాలంపాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆమె.. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీలోకి వెళ్లారు. గత ఎన్నికల ముందు ఆమె టీడీపీని వీడి జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.