రాజధాని అమరావతి తరలిపోతోందంటూ టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం రైతుల భూములు లాక్కుందని ఆరోపించారు. ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని దొనకొండకు తరలిస్తున్నారని ఎవరు చెప్పారని.. సీఎం వైఎస్ జగన్ చెప్పారా? అంటూ ప్రశ్నించారు.
Also Read : ఆ వ్యవహారం నా పెళ్లికి ముందు జరిగింది.. బొత్స వ్యాఖ్యలకు బాలయ్య చిన్నల్లుడు కౌంటర్
దొనకొండలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ట్రేడింగ్ చేసేది చంద్రబాబు, ఆయన కొడుకు లోకేషేనని.. అలానే రైతుల నుంచి వేల ఎకరాల భూములు లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. విశ్వరాజధాని నిర్మిస్తామని చెప్పినా రాజధాని ప్రాంత ప్రజలు నమ్మలేదని, అందుకే మంగళగిరి ప్రజలు లోకేష్ను చిత్తుగా ఓడించడం నిజం కాదా అని ప్రశ్నించారు.
Also Read :Botsa Satyanarayanaకు జగన్ క్లాస్.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
బాలయ్య అల్లుడి భూముల వ్యవహారంలోనూ లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో చంద్రబాబు, కిరణ్కుమార్ రెడ్డి కుమ్మక్కై పాలన సాగించారని.. అదే సమయంలో బాలకృష్ణ అల్లుడికి భూమి కేటాయించారన్నారు. ఎకరం కేవలం లక్ష రూపాయల చొప్పున భూములు కేటాదయించారని, కేవలం లక్షకే భూములు ఎలా కేటాయించారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నిదంచారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారని లక్ష్మీపార్వతి విమర్శించారు. నిరుద్యోగ భృతి పేరిట చంద్రబాబు ప్రభుత్వం యువకులను మోసం చేసిందని, ఎన్నికలకు కొద్ది నెలల ముందు భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. జగన్ వారందరికీ గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారన్నారు.
Also Read : ఆ వ్యవహారం నా పెళ్లికి ముందు జరిగింది.. బొత్స వ్యాఖ్యలకు బాలయ్య చిన్నల్లుడు కౌంటర్
దొనకొండలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ట్రేడింగ్ చేసేది చంద్రబాబు, ఆయన కొడుకు లోకేషేనని.. అలానే రైతుల నుంచి వేల ఎకరాల భూములు లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. విశ్వరాజధాని నిర్మిస్తామని చెప్పినా రాజధాని ప్రాంత ప్రజలు నమ్మలేదని, అందుకే మంగళగిరి ప్రజలు లోకేష్ను చిత్తుగా ఓడించడం నిజం కాదా అని ప్రశ్నించారు.
Also Read :Botsa Satyanarayanaకు జగన్ క్లాస్.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
బాలయ్య అల్లుడి భూముల వ్యవహారంలోనూ లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో చంద్రబాబు, కిరణ్కుమార్ రెడ్డి కుమ్మక్కై పాలన సాగించారని.. అదే సమయంలో బాలకృష్ణ అల్లుడికి భూమి కేటాయించారన్నారు. ఎకరం కేవలం లక్ష రూపాయల చొప్పున భూములు కేటాదయించారని, కేవలం లక్షకే భూములు ఎలా కేటాయించారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నిదంచారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారని లక్ష్మీపార్వతి విమర్శించారు. నిరుద్యోగ భృతి పేరిట చంద్రబాబు ప్రభుత్వం యువకులను మోసం చేసిందని, ఎన్నికలకు కొద్ది నెలల ముందు భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. జగన్ వారందరికీ గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారన్నారు.