యాప్నగరం

YS Jagan: KGH సెంటిమెంట్.. జగన్ సీఎం పదవి పోతుందా?.. వైసీపీ నేత ఆసక్తికర ట్వీట్

ప్రజా సంక్షేమం ప్రధానం, పదవి కాదు ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి 25 సంవత్సరాల తర్వాత అక్కడ అడుగు పెట్టారు. సీఎం జగన్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన వైఎస్సార్‌సీపీ నేత.

Samayam Telugu 8 May 2020, 8:52 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి పదవులు ముఖ్యం కాదు.. ప్రజల ముఖ్యం అంటున్నారు వైఎస్సార్‌సీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ). రాజకీయంగా ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన కష్టాల్లో ఉన్న ప్రజల కోసం వెళ్లారంటున్నారు. ఈ మేరకు పీవీపీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu సీఎం జగన్


ప్రజా సంక్షేమం ప్రధానం, పదవి కాదు ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి 25 సంవత్సరాల తరువాత వైజాగ్ కే.జీ.హెచ్ లోకి అడుగుపెట్టారు. 1995లో ఎన్.టీ.ఆర్ గారు కే.జీ.హెచ్ లో అడుగుపెట్టాక పదవి పోయింది. ఆ భయంతో తరువాత ఏ ముఖ్యమంత్రీ అడుగు పెట్టలేదు. Way to go వైఎస్ జగన్ గారూ అంటూ పీవీపీ ట్వీట్ చేశారు.
విశాఖ కేజీహెచ్‌‌లో అడుగు పెడితే పదవి పోతుందనే ఎప్పటి నుంచో సెంటిమెంట్ ఉందట. గతంలో ఎన్టీఆర్ ఆస్పత్రిలో అడుగు పెట్టి ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారట. అప్పటి నుంచి సీఎంలు, పదవుల్లో ఉన్నవారు అక్కడికి వెళ్లరనే ప్రచారం ఉంది. అంతేకాదు గత ప్రభుత్వంలో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యిందట. మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ కేజీహెచ్‌కు వెళ్లారట. రాత్రి అక్కడే బస చేశారట.. కొద్దిరోజులకే ఆయన పదవి పోయిందని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ప్రస్తావించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.