యాప్నగరం

YS Jagan, కేసీఆర్‌ ఏం చేశారో చూశారుగా, మీకు ఆ దమ్ముందా.. చంద్రబాబుకు సజ్జల సవాల్

తాను నమ్మిన అంశాలపై నమ్మకం, విశ్వాసం ఉన్న నేతలు ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేశారో చూశాం అన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో జగన్.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏం చేశారో అందరికి తెలిసిందే అన్నారు.

Samayam Telugu 18 Dec 2020, 11:20 am
రాజధానిపై రెఫరెండం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్‌కు వైఎస్సార్‌సీపీ ధీటుగా స్పందిస్తోంది. తాజాగా చంద్రబాబుకు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు.. రెఫరెండంకు రెడీనా అన్న వ్యాఖ్యలకు స్పందించారు. తాను నమ్మిన అంశాలపై నమ్మకం, విశ్వాసం ఉన్న నేతలు ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేశారో చూశాం అన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో జగన్.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏం చేశారో అందరికి తెలిసిందే అన్నారు. జగన్, కేసీఆర్ వాళ్ల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారని సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు కూడా టీడీపీ ఎమ్మెమ్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లగలరా అని సవాల్ విసిరారు. ఎన్నికలకు వెళితే ప్రజలు ఎవరివైపు ఉన్నారో తేలుతుందన్నారు.
Samayam Telugu చంద్రబాబు-సజ్జల

రాష్ట్రమంతా తనతోనే ఉందని సీఎం జగన్ అంటున్నారని.. ఇప్పుడు రెఫరెండానికి వెళ్దామా.. ప్రజలు మూడు రాజధానులకు మద్దతిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. సీఎం జగన్‌ ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇష్టమొచ్చినప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులా అన్నారు. చంద్రబాబు అమరావతి ఉద్యమం ఏడాది పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన జనభేరి సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.