యాప్నగరం

స్కూల్ విద్యార్థులకు వైసీపీ ఎమ్మెల్యే పాఠాలు

స్కూల్ విద్యార్థులకు గణితం బోధించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే. టీచర్‌గా మారి హిందీ, గణితం, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థుల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు.. వివరణ ఇచ్చారు.. పిల్లలకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ.

Samayam Telugu 13 Feb 2020, 11:49 am
శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు టీచర్‌గా మారిపోయారు. బందలుప్పి జెడ్పీ స్కూల్‌కు వెళ్లిన ఆయన.. విద్యార్థులకు పాఠాలు చెప్పారు. హిందీ, గణితం, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థుల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు.. వివరణ ఇచ్చారు. గతంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవంతో.. ఆయన మళ్లీ ఉపాధ్యాయుడిగా మారి గణితంలో కొన్ని లెక్కల్ని బోర్డుపై విద్యార్థులకు బోధించారు.
Samayam Telugu mla


జోగారావు తన సొంత నిధులతో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ఆల్ ఇన్ వన్‌లు ముద్రించి.. 52 మందికి పంపిణీ చేశారు. ఏ పేద విద్యార్థి డబ్బులు లేక పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సాయం చేశానన్నారు. నియోజకవర్గ స్థాయిలో 10వ తరగతి విద్యార్థులందరికీ అందజేస్తున్నాను అన్నారు. తమకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థులు పరీక్షల సమయంలో కాలాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని సూచించారు. పదవ తరగతిలో మంచి మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.