యాప్నగరం

నన్నపనేని కులదూషణ కేసు.. డీజీపీని కలిసిన ఎమ్మెల్యే ఆర్కే

దళిత సంఘాల నేతలు నన్నపనేని రాజకుమారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్రాసిటీ చట్టం కింద ఆమెను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో ఆందోళన చేపట్టారు.

Samayam Telugu 13 Sep 2019, 2:23 pm
దళిత ఎస్సైని కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. చలో ఆత్మకూరు నేపథ్యంలో టీడపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా ఎస్సై నన్నపనేని, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను పోలీసు జీపు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Samayam Telugu pjimage (50)


అరెస్టుతో ఆగ్రహం చెందిన నన్నపనేని కులం పేరుతో దూషించారని దళిత మహిళా ఎస్సై అనురాధ ఆవేదన చెందారు. ‘దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ దుర్భాషలాడారని ఆరోపిస్తూ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఫిర్యాదు మేరకు పోలీసులు నన్నపనేనిపై కేసు నమోదు చేశారు.

Must Read :శ్మశానానికి వైఎస్సార్సీపీ కలర్.. టీడీపీ ఎంపీ సెటైర్లు

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నన్నపనేని రాజకుమారిపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళగిరిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అట్రాసిటీ చట్టం కింద ఆమెను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి నిర్వహించిన వ్యక్తి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు.

Also Read :సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. బందర్ యువకుడి అరెస్టు

దళిత సంఘాల ఆందోళనకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం రాష్ట్ర పోలీసు కార్యాలయంలో డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిసి నన్నపనేని రాజకుమారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆర్కే వినతి పత్రం అందజేశారు. భవిష్యత్తులో ఎవరికీ ఇలాంటి అవమానాలు ఎదురుకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.