యాప్నగరం

‘ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు?’ చంద్రబాబుపై అంబటి ఫైర్

మూడు నెలల నుంచి కోడెలను దగ్గరికి రానివ్వని చంద్రబాబు ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల భూకబ్జాలు, దౌర్జన్యాలపై ప్రజలు కేసులు పెడితే ఎందుకు విచారణ జరిపించలేదని ఆయన ప్రశ్నించారు.

Samayam Telugu 19 Sep 2019, 11:10 am
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కోడెల మృతికి మీరంటే మీరే కారణమని టీడీపీ, వైఎస్సార్సీపీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తాజాగా కోడెల ఆత్మహత్యపై విచారణకు ఆదేశించాలని కోరుతూ ఈ రోజు టీడీపీ నేతలు ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలవాలని నిర్ణయించారు.
Samayam Telugu Chandrababu-Naidu


గవర్నర్‌ను కలిసి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా కోరనునన్నారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను వివరించనున్నారు. కోడెల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Must Read: కోడెల మృతి: గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు.. కారణం అదేనా?

టీడీపీ తాజా నిర్ణయంపై అటు వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ఏముఖం పెట్టుకుని గవర్నర్‌ని కలుస్తారంటూ ప్రశ్నిస్తోంది. మూడు నెలల నుంచి కోడెల అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వకుండా చంద్రబాబు దూరం పెట్టారని, మానసికంగా క్షోభ పెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. కోడెల ఆత్మహత్యా యత్నం చేసినా కనీసం పరామర్శించని చంద్రబాబు.. ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హంతకుడే హత్య జరిగిందని యాగీ చేసినట్లుగా చంద్రబాబు ప్రవర్తన ఉందని ఘాటుగా విమర్శించారు.

Also Read: టార్గెట్ సుజనా.. జగన్ సర్కార్‌ రహస్య విచారణ! కోడెల కుటుంబ అరాచకాలపై ప్రజలు ఫిర్యాదులు చేస్తే ఎందుకు నోరెత్తలేదని చంద్రబాబును ప్రశ్నించారు. కోడెల కొడుకు, కూతురు కేట్యాక్స్ వసూలు చేసింది నిజం కాదా? కోడెల అవినీతి సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా ఉన్నారా? లేదా? అని నిలదీశారు. సత్తెనపల్లి, నరసరావుపేటలో భూకబ్జాలు, అసెంబ్లీ ఫర్నిచర్ వంటి అంశాలపై ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు. కోడెల కుటుంబ అవినీతిపై చంద్రబాబుకు 20 ప్రశ్నలు సంధిస్తూ వైఎస్సార్సీపీ నేతలు ప్రకటన విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.