యాప్నగరం

పవన్ అంటే ప్రేమ, అభిమానం.. అదొక్కటే నచ్చలేదు: వైసీపీ ఎమ్మెల్యే అంబటి

'పవన్ అంటే కోపం, ధ్వేషం లేదు.. మీరంటే చాలా గౌరవం, ప్రేమ ఉంది. మీ సినిమాలు చాలాసార్లు కుటుంబ సమేతంగా వెళ్లి చూశాం.. మీరు మంచి నటులు, ప్రేమ, అభిమానం ఉంది. మా ఇంట్లో వివాహానికి వచ్చారు.. మా పిల్లల్ని ఆశీర్వదించారు'

Samayam Telugu 4 Nov 2019, 1:31 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ప్రేమ, అభిమానం ఉందంటున్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కానీ ఆయన చేసే వ్యక్తిగత విమర్శలు, చంద్రబాబు ఎజెండాను మోసే తీరు నచ్చలేదన్నారు. పవన్ ప్రభుత్వానికి రెండు వారాల డెడ్‌లైన్ పెట్టారని.. లేకపోతే అమరావతి వస్తానన్నారని.. ఆయన చక్కగా అమరావతికి రావొచ్చని వ్యాఖ్యానించారు. పార్టీని నడిపించలేకపోతే వెళ్లి సినిమాలు తీసుకోవచ్చని సలహా ఇచ్చారు.
Samayam Telugu pawan.


Read Also: నోరు జారిన అంబటి రాంబాబు.. సోషల్ మీడియాలో ట్రోల్స్

‘పవన్ కళ్యాణ్ విశాఖలో వ్యక్తిగతమైన విమర్శలు చేశారు.. రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు ధర్మమేనా. పవన్ అంటే కోపం, ధ్వేషం లేదు.. మీరంటే చాలా గౌరవం, ప్రేమ ఉంది. మీ సినిమాలు చాలాసార్లు కుటుంబ సమేతంగా వెళ్లి చూశాం.. మీరు మంచి నటులు, ప్రేమ, అభిమానం ఉంది. మా ఇంట్లో వివాహానికి వచ్చారు.. మా పిల్లల్ని ఆశీర్వదించారు. మీరు చంద్రబాబును భుజాన వేసుకొని తిరుగుతుంటే బాధగా ఉంది. జనసైనికుల కోసం పోరాడితే అభ్యంతరం ఏమీ లేదు.. తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ డీఎన్‌ఏలు ఒక్కటే చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడే. బాబు ఎజెండాను మోయడమే పని. పడిపోయిన ఎల్లో బిల్డింగ్‌ను నిలబెట్టేందుకు భవన నిర్మాణ కార్మికుడి అవతారం ఎత్తారే తప్ప.. నిజంగానే భవన నిర్మాణ కార్మికుల కష్టాలు పట్టవు’అన్నారు అంబటి.

చంద్రబాబు హయాంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు రాంబాబు. భవన నిర్మాణ కార్మికుల కోసం కేటాయించిన నిధుల్ని కూడా మళ్లించారని.. అప్పుడు నోరు ఎందుకు లేవడం లేదన్నారు. పవన్ ప్రభుత్వానికి రెండు వారాల టైమ్ ఇస్తారంట.. ఆయనకు ఆ కెపాసిటీ ఉందా అని ప్రశ్నించారు. పవన్ అమరావతి వస్తానన్నారు.. రండి.. అమరావతిలో నడవండి అన్నారు. ఆ కరకట్ట మీదుగా నడిచి.. అక్రమంగా కట్టిన లింగమనేని గెస్ట్ హౌస్‌లో ఉన్న రాజకీయ మిత్రుడ్ని కలిసి.. అక్కడ నుంచి బయటకు వెళ్లమనని చెప్పే ధైర్యం ఉందా అన్నారు అంబటి. పవన్ తాటలు తీస్తే తీయించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తాట తీస్తార అంటూ మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తెచ్చిన స్క్రిప్ట్ పవన్ చదివారని విమర్శించారు.

పవన్‌ కళ్యాణ్‌ కన్ఫ్యూజన్‌, స్పష్టత లేని రాజకీయాలు చేస్తున్నారన్నారు రాంబాబు. ఆయన ఇంతవరకు ఏం పోరాటం చేశారో చెప్పాలని.. పార్టీనీ నడిపించలేక పోతే సినిమాలు చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. టీడీపీ గెలిచిన సీట్లు 23 కాదు.. 24 అని తేలిపోయిందన్నారు. జగన్ పాలనను చూసి ఓర్వలేక.. ఇలా బురదజల్లుతున్నారని మండిపడ్డారు. మంత్రి కన్నబాబు, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.