జనసేన, బీజేపీ పొత్తు పట్ల వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఏడు నెలల కాలంలో జగన్ సర్కారు విఫలం ప్రభుత్వం విఫలమైందనడం సరికాదన్న అంబటి.. కులతత్వాన్ని, అవినీతి, కుటుంబ పాలనను టీడీపీకే కూడా తమ ప్రభుత్వం మీద రుద్దడానికి బీజేపీ-జనసేన ప్రయత్నించడం సరికాదన్నారు. బీజేపీపై పెద్దగా విమర్శలు గుప్పించని ఆయన.. పవన్ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా పవన్కు స్థిరత్వం లేదన్న అంబటి.. జనసేనానికి రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత లేదన్నారు.
Samayam Telugu16 Jan 2020, 7:37 pm
జనసేన, బీజేపీ పొత్తు పట్ల వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఏడు నెలల కాలంలో జగన్ సర్కారు విఫలం ప్రభుత్వం విఫలమైందనడం సరికాదన్న అంబటి.. కులతత్వాన్ని, అవినీతి, కుటుంబ పాలనను టీడీపీకే కూడా తమ ప్రభుత్వం మీద రుద్దడానికి బీజేపీ-జనసేన ప్రయత్నించడం సరికాదన్నారు. బీజేపీపై పెద్దగా విమర్శలు గుప్పించని ఆయన.. పవన్ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా పవన్కు స్థిరత్వం లేదన్న అంబటి.. జనసేనానికి రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత లేదన్నారు.
ప్రజారాజ్యం గతే జనసేనకు
‘‘గతంలో పవన్ సభ్యుడిగా ఉన్న ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది. ఇప్పుడు ఆయన బీజేపీతో కలిసి పని చేస్తారో, కలిసిపోయి పని చేస్తారో తెలీదు. కాంగ్రెస్లో పీఆర్పీ విలీనమైన చరిత్ర చూశాం.. ఇప్పుడు జరగబోతున్న చరిత్రను కూడా చూస్తాం’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో బీజేపీలో జనసేన విలీనం కావచ్చని అర్థం వచ్చేలా వైఎస్సార్సీపీ నేత వ్యాఖ్యలు ఉన్నాయి.
పవన్తో బీజేపీ ప్రయాణం చేయగలదా?
పవన్ కళ్యాణ్కు రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేదని విమర్శించిన అంబటి.. రాజకీయ స్థిరత్వం లేని ఇలాంటి వ్యక్తిని నమ్ముకొని.. కుక్క తోక పట్టుకోని ఈదుతామంటే.. ఈదమనే అంటామని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్తో నాలుగున్నరేళ్లపాటు బీజేపీ ప్రయాణం చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
ఫ్రెష్ లడ్డూలను పంపించారా?
‘‘బేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ అంటున్నారు. గతంలో పాచిన పోయిన లడ్డూలు చేతిలో పెట్టారని మోదీ సర్కారును విమర్శించిన పవన్.. ఇవాళ ఏ లడ్డూలు వచ్చాయని పొత్తు పెట్టుకున్నారు..? మీకు ప్రత్యేకంగా ఫ్రెష్ లడ్డూలను పంపించారా? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చెబుతున్న పవన్.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నార’’ని అంబటి ప్రశ్నించారు.
పొత్తు పెట్టుకునేది మీరు.. అడిగేది మమ్మల్నా..?
‘రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీతో కలిసి ప్రయాణిస్తామని చెబుతున్న పవన్.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని.. ప్రత్యేక హోదా విషయమై మమ్మల్ని అడగమంటారేంటి..? ఇదేనా మీ రాజకీయ నైతికత?’ అని వైఎస్సార్సీపీ నేత నిలదీశారు. 2024లో అధికారమే లక్ష్యంగా సాగుతామని పవన్, బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజకీయ స్థిరత్వం లేని పవన్ నాలుగన్నరేళ్ల పాటు ఒక పార్టీతో కలిసి ముందుకు నడవగలరా? అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు.
బాబు కోసమే పవన్ రాజకీయాలు
ఏడు నెలల్లోనే ఈ ప్రభుత్వం విఫలమైందని విమర్శించడం సమంజసం కాదన్న అంబటి రాంబాబు.. ఎన్ని పార్టీలు కలిసినా.. తాటాకు చప్పుళ్లకు భయపడే రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ కాదన్నారు. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు సపోర్ట్ చేయడం కోసం ఈ కూటమిని పెట్టారా? అని బీజేపీ- జనసేనలను అంబటి రాంబాబు ప్రశ్నించారు.
పవన్కు రాజకీయాాల్లో కొనసాగే అర్హత లేదు
‘‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడూ జగన్నే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబును కాపాడే ఉద్దేశంతోనే పవన్ రాజకీయాలు చేస్తున్నారు. జనసేన.. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ, ఆయన చేత నడిపించబడుతున్న పార్టీ. బాబు గతంలో సుజానా చౌదరి, సీఎం రమేశ్లను పంపించారు. ఇప్పుడు మీరు బీజేపీతో కలిసి పని చేస్తారో.. లేదంటే కలిసిపోయి పని చేస్తారో తెలీదు. బాబును రక్షించడం కోసం ఆయన అధ్యక్షతన నడిపే కూటమిలా మీరు తయారయ్యారు. సిద్ధాంతాలు, స్థిరత్వం లేని వ్యక్తి పవన్. ఆయనకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.