యాప్నగరం

YS Jaganను కలిసిన ఆనం.. ‘నెల్లూరు మాఫియా’పై వివరణ!

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. నెల్లూరు మాఫియా అంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

Samayam Telugu 12 Dec 2019, 9:46 pm
నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి.. గురువారం సీఎం జగన్‌ను కలిశారు. నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ఆనంను బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తాను ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఆనం వివరణను శ్రద్ధగా విన్న సీఎం.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాలన్నారు. మీలాంటి సీనియర్ నేతలు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.
Samayam Telugu anam


ముఖ్యమంత్రికి ఆనం రాంనారాయణ రెడ్డి వివరణ ఇవ్వడంతో.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్న ప్రతిపాదనను వైఎస్సార్సీపీ విరమించుకుంది. ఏదైనా సమస్య ఉంటే నేరుగా పార్టీ నేతలతో మాట్లాడాలన్నారు.

ఇంతకూ ఆనం ఏమన్నారు..?నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందన్న ఆనం.. పోలీసులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఏ మాఫియా కావాలన్నా నెల్లూరులో ఉన్నాయని.. వ్యవస్థల్ని సరిగా పనిచేయనీయడం లేదన్నారు. నెల్లూరులో పరిస్థితులేం బాగోలేవన్నారు. లిక్కర్, బెట్టింగ్, ల్యాండ్, శాండ్.. ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుందన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆనం చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ శ్రేణులకు షాకిచ్చాయి. ఆయన చేసిన కామెంట్స్ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉండటంతో.. విజయసాయి రెడ్డి ఆయనకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.