యాప్నగరం

YS Jagan ను బ్రాహ్మణ బిడ్డ అనుకున్నాం.. ఆయన చెప్పే మంత్రాలు వింటే షాక్.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

YS Jagan Mohan Reddy: సీఎం జగన్ తిరుమల వెళ్లినప్పుడు ఆయన్ను చూసి అందరూ బ్రాహ్మణ బిడ్డ అనుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Samayam Telugu 30 Sep 2020, 11:20 am
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన్నప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే గుడులపై దాడులు జరిగిన నేపథ్యంలో సీఎం జగన్‌ మతం ప్రస్తావన వచ్చింది. ఈ తరుణంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహార్యాన్ని చూసి అందరూ బ్రాహ్మణుల బిడ్డ అని అనుకున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అలాగే సీఎం జగన్ స్వామి వారి మంత్రాలు చదువుతుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. తాను హిందువునని.. తనకు కూడా మంత్రాలు చదవడం రాదన్నారు.
Samayam Telugu తిరునామంతో సీఎం జగన్

అయితే రాష్ట్రంలో మతాలపై గొడవలు పెట్టాలని ప్రతిదాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వివాదం చేస్తున్నారని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి విమర్శించారు. సీఎం జగన్ నామం పెట్టినా కూడా అందులో కూడా తప్పువెతికి వివాదం చేస్తారన్నారు. ముందు చంద్రబాబు గారు ఫస్ట్ షూ విప్పి దేవుడికి పూజచేయడం నేర్చుకో అంటూ ఎద్దేవా చేశారు.

కరోనా లాక్ డౌన్‌ అన్ లాక్ అయిందని, దయచేసి ఇప్పటికైనా తెలంగాణ నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి సూచించారు. ఓడిపోగానే హైదరాబాద్ వెళ్ళి కూర్చున్నారని, లాక్ డౌన్ సమయంలో ఏపీకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని హితవుపలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.