యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌ ఎస్కార్ట్ వాహనం బోల్తా

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెన్నై వెళుతుండగా ప్రమాదం.. బోల్తాకొట్టిన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం. ఎమ్మెల్యే వాహనానికి ముందున్న కారులో ఉండటంతో ప్రమాదం తప్పిపోయింది.

Samayam Telugu 25 Jan 2020, 7:09 am
ప్రభుత్వ విప్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెన్నై వెళుతుండగా వాహనం బోల్తాకొట్టింది. ప్రమాదంలో ఆ వాహనంలో ఉన్న సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.. బాధితుల్ని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu ctr


ఎమ్మెల్యే చెవిరెడ్డి క్షతగాత్రుల్ని దగ్గరుండి ఆస్పత్రికి తరలించే వరకు ఉన్నారు.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ వాహనానికి ముందున్న వాహనంలో ఉన్నారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పిపోయింది. వాహనం బోల్తాపడటంతో ఆ మార్గంలో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి. తర్వాత పోలీసులు స్థానికులతో కలిసి వాహనాన్ని పక్కకు తీయడంతో మళ్లీ వాహనాల రాకపోకలు జరిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.