యాప్నగరం

నాకు స్వేచ్ఛ లేదు, ఇదేం వివక్ష.. .. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh| 'బాపూజీ పుట్టిన గడ్డ మీద, ఆ మహానుభావుని జయంతి రోజునే ఒక దళిత ఎమ్మెల్యే తనపై వివక్ష చూపిస్తున్నారని బాధపడ్డారంటే, ఇంక రాష్ట్రంలో దళిత ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు'

Samayam Telugu 2 Oct 2019, 8:44 pm
‘దళితులంటే చిన్న చూపు, నాకు స్వేచ్ఛ లేదు.. లక్షలాది మంది ఓట్లు వేసి తనను గెలిపిస్తే.. పని చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా.. ఇంకా వివక్షత కొనసాగుతోంది’అన్నారు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు. గాంధీ జయంతి రోజు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు కలకలంరేపాయి. ఈ వీడియోను మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దళితుల్ని ఎదగనివ్వరా అంటూ మండిపడ్డారు.
Samayam Telugu golla.


Read Also: 'ఆ కమిషన్ మొత్తం జగన్ నోక్కేస్తున్నాడని విజసాయిరెడ్డి బాధ'

లోకేష్ తన ట్వీట్‌లో ‘మానవజాతి ఔన్నత్యం మనుషులుగా జన్మించటంలో లేదు.. మానవత్వంతో జీవించటంలోనే ఉందన్నారు గాంధీ మహాత్ముడు. అలాంటి బాపూజీ పుట్టిన గడ్డ మీద, ఆ మహానుభావుని జయంతి రోజునే ఒక దళిత ఎమ్మెల్యే తనపై వివక్ష చూపిస్తున్నారని బాధపడ్డారంటే, ఇంక రాష్ట్రంలో దళిత ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’అన్నారు.
‘గాంధీ జయంతి రోజున మద్యం అమ్మించిన వారు, చికెన్, మటన్ లతో సంబరాలు చేసుకున్నవారి నుండి గాంధీజీ ఆశించిన సమసమాజ నిర్మాణం ఆశించడం అత్యాశే. ప్రజలకు సేవ చేసే స్వేచ్ఛ లేకుండా లక్షలాది ప్రజలు ఓటేసి గెలిపించుకున్న ఒక దళిత ఎమ్మెల్యే చేతులు కట్టేస్తారా? మీ పాలనలో దళితులను ఎదగనివ్వరా?’అంటూ ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.