యాప్నగరం

Chandrababu Naiduపై పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

Samayam Telugu 6 Jan 2020, 7:47 am
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోలీసులకు వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఫిర్యాదు చేశారు. దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని నక్కలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు బాబూరావు.
Samayam Telugu babu


చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ దళితుల్ని కించపరుస్తూ ఎన్నో సందర్భాల్లో మాట్లాడారన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతి సందర్భంలో దళితులను అవమానించడం అలవాటైపోందన్నారు. ఇప్పటికీ ఆయన తన పద్దతి మార్చుకోలేదని.. దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. టీడీపీలో ఉన్న దళితులు ఇప్పటికైనా చంద్రబాబు నిజ స్వరూపం తెలుసుకోవాలన్నారు.

గొల్ల బాబూరావుతో పాటూ రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రబాబు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బోస్టన్ కన్సస్టలింగ్ గ్రూప్ నివేదిక విషయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను కించపరిచేలా మాట్లాడారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.