యాప్నగరం

YSRCP ఎమ్మెల్యే మనవడికి కరోనా.. సెల్ఫీ వీడియో వైరల్

ఎమ్మెల్యే మనవడు ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. బాలుడు తన తండ్రితో కలిసి సెల్ఫీ వీడియో తీసి పంపారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samayam Telugu 27 Jun 2020, 9:21 am
ఏపీ ప్రజల్ని కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ తప్పడం లేదు. ఇటీవల వరుసగా జరిగిన ఘటనలు కలకలంరేపాయి. ముఖ్యంగా ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ తేలింది.. అంతేకాదు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే మనవడు, వ్యక్తిగత సిబ్బందికి కూడా వైరస్ సోకింది.
Samayam Telugu వీడియో వైరల్


ఎమ్మెల్యే మనవడు ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. బాలుడు తన తండ్రితో కలిసి సెల్ఫీ వీడియో తీసి పంపారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పేరు గౌతమ్ అని, తన తాత గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ఆస్పత్రిలో మంచి వైద్యం అందిస్తున్నారని చెప్పుకొచ్చాడు. కరోనా బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.