యాప్నగరం

‘చంద్రన్న వైరస్.. ఎక్కడుంటే అక్కడ నాశనమే’

విశాఖలో భూదోపిడీ జరిగిందని టీడీపీ చేసిన ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. రాష్ట్రానికి చంద్రన్న వైరస్‌ పట్టిందని.. బాబు ఎక్కడ ఉంటే అక్కడ నాశనమేనని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 9 Feb 2020, 6:57 pm
విశాఖపట్నంలో భూదోపిడీలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ చేసిన ఆరోపణలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. చైనాలో కరోనా మహమ్మారిలా రాష్ట్రానికి చంద్రన్న వైరస్‌ పట్టిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రన్న వైరస్‌కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని విమర్శించారు.
Samayam Telugu babu sad


Also Read: ‘విశాఖలో వైసీపీ బినామీ దందా.. భూ దోపిడీ రూ. వందల కోట్లలో’

చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ నాశనం, వినాశనం, విధ్వంసం అని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిందంటూ టీడీపీ తమపై రాద్ధాంతం చేస్తోందని.. టీడీపీ హయాంలోనే వేల ఎకరాలు కబ్జా అయ్యాయని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలతో బురదచల్లేందుకు టీడీపీ యత్నిస్తుందని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఆలోచన టీడీపీకి లేదని ధ్వజమెత్తారు.

Also Read: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నిజ నిర్ధారణ కమిటీ విశాఖలో కాదని.. అమరావతిలో వేసుకోవాలని అమర్‌నాథ్ సూచించారు. చంద్రబాబుకు ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడం ఇష్టం లేదన్నారు. విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలపై విషం కక్కుతారా అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

Also Read: ‘సీఎం జగన్, చంద్రబాబు మధ్య రహస్య ఒప్పందం’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.