యాప్నగరం

ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

లాక్‌డౌన్‌ దెబ్బకు అక్కడక్కడా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులుపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.

Samayam Telugu 25 Mar 2020, 1:13 pm
ఏపీలో లాక్‌డౌన్ కొనసాగుతోంది.. వరుసగా మూడో రోజు ప్రజలు రోడ్లపైకి రాకుండా ఇళ్లకే పరిమితవమవుతున్నారు. కొందరు మాత్రం ప్రభుత్వ హెచ్చరికలు పట్టించుకోకుండా బయటకు వస్తుండగా.. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వెనక్కు పంపిస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఉదయం గంట నుంచి రెండు గంటల సమయం కేటాయిస్తున్నారు. ఆ సమయంలోనే పనులు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని.. సాయంత్రం ఏడు గంటల నుంచి తెల్లవారే వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందంటున్నారు.
Samayam Telugu mla


లాక్‌డౌన్‌ దెబ్బకు అక్కడక్కడా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులుపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు. పేదలకు ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కరోనా వైరస్ ఉధృతమవుతున్న దృష్ట్యా ప్రజలందరూ స్వీయ నిర్భంధాన్ని పాటిస్తూ, ఇళ్లకే పరిమితమవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి, పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.

మరోవైపు ఎమ్మెల్యే, విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో శానిటైజర్ బాటిల్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. కొంతమంది పేదలు శానిటైజర్లు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన ఉండదని.. అందుకే వారి కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే కొందరు నేతలు ఉచితంగా మాస్కులు ప్రజలకు అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.