గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రజలను దోచుకుతిన్నారని గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలు కోడెల, యరపతినేని శ్రీనివాసరావు అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇసుక, మట్టి, మైనింగ్, గంజాయి సహా అసెంబ్లీ ఫర్నీచర్ను కూడా వదల్లేదని ఆరోపించారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదల్లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. Must Read :జగన్ సర్కార్ రౌడీయిజానికి ఇదే నిదర్శనం.. చర్యలు తీసుకునే దమ్మందా? లోకేష్ సూటి ప్రశ్న
పల్నాడులో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ పాలనలో పల్నాడులో ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి మొదలైందన్నారు. కోడెల, యరపతినేని ముఖాలు చెల్లకనే పక్క జిల్లాల నేతలను ఇక్కడికి తీసుకొచ్చారని విమర్శించారు.
Also Read :పల్నాడులో సమస్యాత్మక గ్రామాలెన్నో! మరి ఆత్మకూరే ఎందుకు?
ఎన్నికల్లో ఓడి మూడు నెలలు గడిచిందో లేదో జమిలి ఎన్నికలు వస్తున్నాయంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని మహేష్ రెడ్డి మండిపడ్డారు. మూడేళ్లలోనే కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారని, మూడేళ్లు కాదు మూడు నెలల్లో ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రజలు చిత్తుగా ఓడించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని తీవ్రంగా విమర్శించారు.
పల్నాడులో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ పాలనలో పల్నాడులో ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి మొదలైందన్నారు. కోడెల, యరపతినేని ముఖాలు చెల్లకనే పక్క జిల్లాల నేతలను ఇక్కడికి తీసుకొచ్చారని విమర్శించారు.
Also Read :పల్నాడులో సమస్యాత్మక గ్రామాలెన్నో! మరి ఆత్మకూరే ఎందుకు?
ఎన్నికల్లో ఓడి మూడు నెలలు గడిచిందో లేదో జమిలి ఎన్నికలు వస్తున్నాయంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని మహేష్ రెడ్డి మండిపడ్డారు. మూడేళ్లలోనే కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారని, మూడేళ్లు కాదు మూడు నెలల్లో ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రజలు చిత్తుగా ఓడించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని తీవ్రంగా విమర్శించారు.