ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం నామినేషన్ దాఖలుచేశారు. ఈమేరకు శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఉపసభాపతి కోన రఘుపతి స్థానంలో కోలగట్లను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఈ పదవికి ప్రతిపక్షం పోటీ పడనందున కోలగట్ల ఏకగ్రీంగా ఎన్నిక కానున్నారు. గురువారం రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. శుక్రవారం సాయంత్రం వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవికి వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం డిప్యకూటీ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి టీడీపీ నుంచి పోటీ లేదు. దీంతో కోలగట్ల ఎన్నిక ఏకగ్రీవం లాంఛనమే అని చెప్పాలి. సామాజిక సమీకరణాలతో కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఆ పదవిలో కోలగట్లకు అవకాశం దక్కింది.
వాస్తవానికి కోలగట్ల వీరభద్రస్వామి ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవిని ఆశించారు. కానీ కొన్ని సమీకరణాలతో కేబినెట్ బెర్త్ దక్కలేదు. అందుకే ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలోనే డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో రఘుపతి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ అసెంబ్లీ కొత్త డిప్యూటీ స్పీకర్ రాబోతున్నారు.
వాస్తవానికి కోలగట్ల వీరభద్రస్వామి ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవిని ఆశించారు. కానీ కొన్ని సమీకరణాలతో కేబినెట్ బెర్త్ దక్కలేదు. అందుకే ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలోనే డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో రఘుపతి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ అసెంబ్లీ కొత్త డిప్యూటీ స్పీకర్ రాబోతున్నారు.