యాప్నగరం

నడిరోడ్డుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే వేడుకలు.. స్తంభించిన ట్రాఫిక్, 2 గంటలు నరకయాతన

ఎమ్మెల్యే కుమారుడి పుట్టిన రోజు వేడుకలను నడిరోడ్డు మీద గ్రాండ్‌గా నిర్వహించడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో స్కూలు పిల్లలు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తున్న వారు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

Samayam Telugu 19 Sep 2019, 12:06 pm
‘ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలి. వారికి ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించాలి. ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడొద్దు..’ ఏపీ సీఎం వైఎస్ జగన్ చెబుతున్న మాట ఇది. కానీ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు మాత్రం ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెట్టాడు. నడిరోడ్డు మీద, అందులోనూ నాలుగు రోడ్ల జంక్షన్‌లో పుట్టిన రోజు వేడుకలు చేసుకొని.. రెండు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ కావడానికి కారణమయ్యాడు.
Samayam Telugu birthday traffic jam


వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు తనయుడు వికాస్ పుట్టిన రోజు వేడుకలను అంబాజీపేటలోని ఓ జంక్షన్‌లో నిర్వహించారు. ఎమ్మెల్యేగారి అబ్బాయి అంటే.. కాబోయే ఎమ్మెల్యే కదా.. అనుచరులంతా ఆయన పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు.

దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బర్త్ డే వేడుకలు నిర్వహించడంతో.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిన వారు, స్కూల్ పిల్లలు.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎమ్మెల్యే గారబ్బాయి పుట్టిన రోజు వేడుకల పట్ల పోలీసులు సైతం సైలెంట్‌గా ఉండిపోయారు.

ఎమ్మెల్యే కొడుకు పుట్టిన రోజైతే.. ఇంట్లో గ్రాండ్‌గా సెల్రబేట్ చేసుకోవచ్చు కదా.. ఇలా రోడ్డు మీద సంబరాలు చేసుకుంటూ జనాలను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాసేవ చేయకపోతే చేయకపోయారు.. ఇలా జనాలను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.