యాప్నగరం

అధికారంలో ఉన్నా సమస్యలు తీర్చలేకపోతున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పట్టించుకోవటం లేదని నిరసన వ్యక్తం చేశారు. 90 గ్రామాల ప్రజలు తాగునీరు లేక ఇబ్బందిపడుతున్నారని.. సీఎం జగన్‌ తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 100 కోట్లిస్తే రూపాయి ఖర్చు చేశారా అని ప్రశ్నించారు.

Samayam Telugu 2 Jun 2020, 9:28 am
ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తీరు ఆసక్తికరంగా మారింది. ఆయన ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట బైఠాయించడం చర్చనీయాంశమైంది. కందుకూరు నియోజవర్గానికి సంబంధించిన సమస్యలపై సీఈవో కైలాస్‌ గిరీశ్వర్‌తో చర్చించేందుకు వెళ్లారు. తాగునీటి పథకాల నిర్వహణతో పాటు ఇతర బిల్లుల చెల్లింపు విషయమై సీఈవోను ప్రశ్నించారు. ఆ అంశాలపై పూర్తి సమాచారం ఇస్తేనే ఇక్కడి నుంచి వెళతానని తేల్చి చెప్పి అక్కడే కూర్చున్నారు. అధికారులకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఎమ్మెల్యే మండిపడ్డారు.
Samayam Telugu వైసీపీ ఎమ్మెల్యే


కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పట్టించుకోవటం లేదని నిరసన వ్యక్తం చేశారు. 90 గ్రామాల ప్రజలు తాగునీరు లేక ఇబ్బందిపడుతున్నారని.. సీఎం జగన్‌ తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 100 కోట్లిస్తే రూపాయి ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను అధికారులు తుంగలో తొక్కుతున్నారని.. అధికారంలో ఉండి కూడా నియోజకవర్గ సమస్యలు తీర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనే ఇలా జరుగుతోందా? మిగతా ప్రాంతాల్లోనూ ఇలానే చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా జర్నలిస్టులకు ఇచ్చిన బియ్యం క్వాలిటీపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.