YSRCP ఎమ్మెల్యే పార్టీ మారుతారని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన నల్లపరెడ్డి
మంత్రి పదవి రాకపోవడంతో పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారంపై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాగే, తన రాజకీయ వారసుడిని కూడా ప్రకటించారు.
పార్టీ మారుతున్నానని తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వాపోయారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. కోవూరులో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీలో వైఎస్ విజయమ్మ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని తానేనన్నారు. అంతటి సీనియర్ నాయకుడినైన తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో తాను తెలుగు దేశం పార్టీలోకి చేరుతున్నట్లు తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుని రాష్ట్రంలో తాను తిట్టినంతగా ఎవరూ తిట్టలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును తిట్టడంలో తన తర్వాత ఆ స్థానాన్ని కొడాలి నాని తీసుకున్నారని విమర్శించారు.
ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముహం చూసే కోవూరు నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గుర్తు చేశారు. మంత్రి పదవి రాలేదని చాలాచోట్ల కొంతమంది జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టారని.. కానీ, తన నియోజకవర్గంలో మాత్రం అలాంటి ఘటనలు జరగనివ్వలేదని పేర్కొన్నారు. తాను చనిపోయేంత వరకూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోనే ఉంటానని తేల్చి చెప్పారు. తర్వాత తన కుమారుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి కొనసాగుతారని పేర్కొన్నారు. పార్టీ మారుతానంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో తాను తెలుగు దేశం పార్టీలోకి చేరుతున్నట్లు తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుని రాష్ట్రంలో తాను తిట్టినంతగా ఎవరూ తిట్టలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును తిట్టడంలో తన తర్వాత ఆ స్థానాన్ని కొడాలి నాని తీసుకున్నారని విమర్శించారు.
ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముహం చూసే కోవూరు నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గుర్తు చేశారు. మంత్రి పదవి రాలేదని చాలాచోట్ల కొంతమంది జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టారని.. కానీ, తన నియోజకవర్గంలో మాత్రం అలాంటి ఘటనలు జరగనివ్వలేదని పేర్కొన్నారు. తాను చనిపోయేంత వరకూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోనే ఉంటానని తేల్చి చెప్పారు. తర్వాత తన కుమారుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి కొనసాగుతారని పేర్కొన్నారు. పార్టీ మారుతానంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.