యాప్నగరం

‘పల్నాడుకు 10 కార్లలో గూండాలను పంపిన చంద్రబాబు’

Macherla: పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తోందని మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి ఆరోపించారు.

Samayam Telugu 11 Mar 2020, 6:55 pm
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు తెలుగు దేశం పార్టీ యత్నిస్తోందని మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విజయవాడ నుంచి 10 కార్లలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సహా మరికొందరు గూండాలను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పంపించారని ఆరోపించారు. మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఓ పిల్లాడికి తగిలిందని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని తెలిపారు.
Samayam Telugu macharla


Also Read: బాలకృష్ణ అమాయకుడు.. ఆయన మాటకు విలువే లేదు.. బాలయ్య మిత్రుడు బాబురావు సంచలనం

బాధితులను సముదాయించాల్సింది పోయి బొండా ఉమా సహా ఇతర టీడీపీ నాయకులు దుర్భాషలాడారని పిన్నెల్లి తెలిపారు. పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ వ్యూహమని, అందులో భాగంగానే 10 కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారని ఆరోపించారు.

ప్రజాబలం లేని చంద్రబాబు.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని పిన్నెల్లి పేర్కొన్నారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ముస్తాఫాలపై ఆనాడు దాడులు చేసి చంపడానికి యత్నించారని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న రైతుల ముసుగులో తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అయినా తాము సంయమనంతో వ్యవహరించామని తెలిపారు.

Also Read: చిరంజీవి లేకపోతే ఆత్మహత్యే గతి.. వాళ్లు చెప్పుతో కొట్టి పంపారు.. పృథ్వీరాజ్ షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.