యాప్నగరం

ఏలూరు జనాల అస్వస్థతకు సీఎం జగన్ మేనమామ కారణమని ప్రచారం.. టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే షాక్

ఏలూరు ఘటనకు లింక్ పెడుతూ సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. ఈ పోస్టుల విషయం తెలియడంతో ఎమ్మెల్యే సీరియస్‌గా స్పందించారు.

Samayam Telugu 8 Dec 2020, 8:08 am
ఏలూరు వింత వ్యాధి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జనాలు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ వ్యాధికి కారణాలు ఏంటో తేల్చే పనిలో ఉన్నారు అధికారులు.. ఇదిలా ఉంటే ఏలూరు ఘటనకు లింక్ పెడుతూ సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. కల్తీ క్లోరిన్‌ నీటిలో కలవడం వల్లే ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని.. నీటి శుద్ధికి కావాల్సిన రసాయనాలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సరఫరా చేస్తున్నారంటూ పోస్ట్‌లు వచ్చాయి.
Samayam Telugu సీఎం జగన్


Read Also: ఏలూరు ప్రజల అస్వస్థతకు కారణమిదే.. ఎయిమ్స్ పరీక్షల్లో తేలిపోయింది

ఈ పోస్టుల విషయం తెలియడంతో ఎమ్మెల్యే సీరియస్‌గా స్పందించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఇలా దిగజారి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని.. తాను అలాంటి వ్యాపారమేదీ చేయలేదని, క్లోరిన్‌ సరఫరా, ఇతర కాంట్రాక్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Must Read:
జగన్ సర్కార్‌కు లోకేష్ ట్విస్ట్.. కేంద్రానికి సంచలన లేఖ

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మేనమామ అయినందుకే టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తూ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేశామే తప్ప.. ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చేయలేదన్నారు. దోషులపై 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు.

Also Read: ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధి.. లక్షణాలు మారాయి, కోలుకున్నా కొందరికి మళ్లీ ఫిట్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.