యాప్నగరం

ఆయన్ను అలా చూసి కన్నీళ్లొచ్చేవి.. ఫైర్‌బ్రాండ్ రోజా భావోద్వేగం..

ముఖ్యమంత్రి కొడుకుగా ఇంతమందితో మాటలు పడాల్సిన అవసరం లేదు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన జగన్ ఏ కేంద్రమంత్రి పదవో తీసుకుని సుఖంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ జగన్ అవన్నీ వదులుకుని ఆశయం కోసం పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు.

Samayam Telugu 7 Nov 2019, 4:57 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆకాశానికెత్తేశారు ఏపీపీఎస్సీ చైర్ పర్సన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు సీఎం జగన్‌ వైపే చూస్తున్నారని ఆర్కే రోజా అన్నారు. తమిళనాడులో తనను చాలా మంది అడిగారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబిచ్చారు. మండుటెండల్లో కాళ్లబొబ్బలు వచ్చినా.. కందిరీగలు రేగినా తొణకని వ్యక్తి జగన్ అన్నారు. చివరికి ఆయనను అంతమొందించాలని కుట్రలు చేసినా ఆయన అన్నింటినీ అధిగమించారని కొనియాడారు.
Samayam Telugu 177731-roja


నవంబర్ 6న ఆయన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పాత జ్ఞ‌ాపకాలను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు రోజా. దాదాపు 3648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు, 2500 గ్రామాల్లో జగన్ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారన్నారు. ప్రజా సమస్యలను డైరీలో రాసుకుని వాటి పరిష్కారానికి జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన ఘటన జగన్‌కే దక్కిందన్నారు. మరో రెండు లక్షలకు పైగా వాలంటీర్ల పోస్టులు కల్పించారని చెప్పారు.

Also Read: తిరుపతిలో ఘోరం.. ఉద్యోగినితో బలవంతంగా మద్యం తాగించి..

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీల నేతలు అధికార పార్టీని ప్రశ్నించకుండా జగన్‌పై దుమ్మెత్తిపోసేవారని రోజా అన్నారు. ముఖ్యమంత్రి కొడుకుగా ఇంతమందితో మాటలు పడాల్సిన అవసరం లేదని.. ఆ విషయంలో తాము కూడా చాలా బాధపడ్డామని రోజా అన్నారు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన జగన్ ఏ కేంద్రమంత్రి పదవో తీసుకుని సుఖంగా ఉండాల్సిన వ్యక్తి.. కానీ అవన్నీ కాదనుకుని తన తండ్రి ఆశయాల కోసం రాజకీయాలు చేస్తున్నారని రోజా అన్నారు.

జగన్‌ అహంకారి.. పెద్దలకు విలువ ఇవ్వడని పచ్చమీడియా చేసిన ప్రచారం అబద్దమని పాదయాత్రతో తేలిపోయిందని రోజా అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడంతో ఆయన వ్యవహారశైలి కూడా ప్రజలకు తెలిసిందన్నారు. మండుటెండలో.. దుమ్ముధూళిలో ఆయన ఎంతో కష్టపడ్డారని చెప్పారు. మనిషి కూడా సగం అయిపోయారని.. ఆయన వెంట నడుస్తుంటే కళ్ల వెంట నీరొచ్చేది అని పాత జ్ఞ‌ాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Read Also: నడిబజారులో రెచ్చిపోయిన హోంగార్డు.. అవమానంతో ఆటోడ్రైవర్ అఘాయిత్యం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.