యాప్నగరం

ఆడంగి వెధవల్లారా.. ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్

అమరావతి ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా. 'అమరావతిలో ఉన్న మగవాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ము లేదా.. అక్కడి మగవాళ్ళు ఆడంగి వెధవల్లాగా ఆడవారి వెనుక దాక్కుంటున్నారు' అంటూ ఫైర్.

Samayam Telugu 14 Jan 2020, 8:35 am
ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మహిళల్ని కూకట్ పల్లి నుంచి తీసుకొచ్చిన అమరావతిలో డ్రామాలు ఆడుతున్నారన్నారు. అమరావతిలో ఆడవాళ్లని ముందుపెట్టి ఉద్యమం చేస్తున్నారని.. ఆ ప్రాంతంలో ఉన్న మగవాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ము లేదా.. అక్కడి మగవాళ్ళు ఆడంగి వెధవల్లాగా ఆడవారి వెనుక దాక్కుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
Samayam Telugu roja.


ఆడవారిని తీసుకొచ్చి నాటకాలు ఆడుతూ.. రోడ్ల మీదకు వదిలి పోలీసులు కొట్టారంటూ ఏడుస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. కొందరు చేసిన తప్పులకు ఆడవారిని ఎందుకు బలి చేస్తున్నారని ప్రశ్నించారు. అక్కడి మహిళలంతా స్వార్థం కోసమే ఉద్యమం చేస్తున్నారని.. 'లోకేష్ స్నేహితుడైన ఓ డైరెక్టర్ మన వాళ్లు హైదరాబాద్ నుంచి వెళ్లి బాగా ధర్నా చేస్తున్నారని' ట్వీట్ చేశారని.. చంద్రబాబు చిత్తూరులో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అన్నారు.

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అమరావతిలో ఎందుకు భవనాలు నిర్మించలేకపోయారని రోజా ప్రశ్నించారు. రాజధాని పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ పాలనలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని.. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాను అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.