యాప్నగరం

వాళ్లిద్దరూ నోరు విప్పితే లోకేష్, చంద్రబాబు బండారం బయటకు: రోజా

వాళ్లు నోరు విప్పితే చంద్రబాబు, లోకేష్‌ల బండారం బయటపడుతుందన్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌ రెడ్డిని బుజ్జగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

Samayam Telugu 16 Jun 2020, 8:11 am
అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌ల తర్వాత కుడితిలో పడ్డ ఎలుకల్లా గిల గిల కొట్టు కుంటున్నారని ఎద్దేవా చేశారు నగరి ఎమ్మెల్యే రోజా. విజయవాడ, అనంతపురానికి పరుగులు తీశారన్నారు. అచ్చెన్న, ప్రభాకర్‌రెడ్డి అవినీతి చేసి అడ్డంగా దొరికి పోయారని.. వాళ్లు నోరు విప్పితే చంద్రబాబు, లోకేష్‌ల బండారం బయటపడుతుందన్నారు. అందుకే ఇద్దరూ భయపడుతున్నారన్నారు. వాళ్లిద్దరు ఎక్కడ నోరు విప్పుతారనే టెన్షన్ వెంటాడుతోందన్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌ రెడ్డిని బుజ్జగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనడం సిగ్గు చేటన్నారు.
Samayam Telugu చంద్రబాబు


కరోనా వైరస్‌తో జనం అల్లాడుతుంటే చంద్రబాబు ఒక్కరోజు కూడా ప్రజలకు ధైర్యం చెప్పలేదన్నారు రోజా. హైదరాబాద్‌ నుంచి రావడానికి తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పుకున్న ఆయన.. మరి ఇప్పుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా నిస్తుంటే నిబంధనలు‌ పాటించలేదని వైఎస్సార్‌సీపీ నేతల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు ఎలా వచ్చారని నిలదీశారు. ఇదంతా చంద్రబాబు నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.