యాప్నగరం

మెంటల్ మామో.. చందమామో!! మొద్దు పిల్లోడికి తిన్నదరక్క.. ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ కౌంటర్

టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాల్సిందేనని టీడీపీ నేత లోకేశ్ చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించారు ఫైర్‌బ్రాండ్ రోజా. చంద్రబాబు, లోకేశ్‌లపై జబర్దస్త్ సెటైర్లతో విరుచుకుపడ్డారు.

Samayam Telugu 16 Jun 2021, 7:25 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
roja
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌‌కి దిమ్మతిరిగే కౌంటరిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రోజా. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ నారా లోకేశ్ చేస్తున్న విమర్శలపై ఆమె ఘాటుగా స్పందించారు. లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో మొద్దుల్లాగా వెనకబడిపోవాలని కోరుకుంటున్నట్లు ఉందని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌కి తిన్నది అరగక విమర్శలు చేస్తున్నారని.. అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా అని ఆమె ప్రశ్నించారు.

పరీక్షలపై సీఎం జగన్ ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు రోజా. రాష్ట్రంలో పరీక్షలు జరుపుతామనో, జరపబోమనో ఇప్పటికీ సీఎం చెప్పలేదని.. లోకేశ్ ఆ విషయం తెలుసుకోవాలని రోజా హితవు పలికారు. పిల్లల భవిష్యత్తు కోసం పరీక్షలు జరిపేందుకు అనువైన సమయం కోసం సీఎం జగన్ చూస్తున్నారని రోజా అన్నారు. పరీక్షలు లేకపోతే లోకేశ్ లాంటి మొద్దు పిల్లలు సంతోషిస్తారు.. కానీ బాగా చదివే పిల్లలు బాధపడతారని రోజా అన్నారు.

అలాగే పోటీ పరీక్షలు నీట్, ఎంసెట్‌కి ఇంటర్ పాత్రిపదిక అని.. ఆ పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థుల్లో ఉదాసీన వైఖరి ఏర్పడుతుందని రోజా అన్నారు. జగన్‌ను మెంటల్ మామ అని లోకేశ్ విమర్శించడంపై రోజా ఘాటుగా స్పందించారు. ఆయన మెంటల్ మామో.. చందమామో ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకే మెంటల్ అని రోజా ఎదురుదాడికి దిగారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.