యాప్నగరం

దమ్ముంటే ఆ ఆరోపణలు నిరూపించండి.. చంద్రబాబుకు మహిళా ఎమ్మెల్యే సవాల్

చంద్రబాబు ప్రచారం గోబెల్స్‌ను మించిపోయిందని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ధ్వజమెత్తారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కనీస వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 4 Oct 2019, 10:44 pm
సోషల్ మీడియా పోస్టులపై మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు యువకుడిని పోలీస్ స్టేషన్‌లో కొడుతూ ఎమ్మెల్యేకు వీడియో కాల్‌లో చూపించారని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం కోటి అనే వ్యక్తి దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. అతనిపై తమ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారని తెలిపారు.
Samayam Telugu chandrababu 2


Read Also: జగన్ క్రైస్తవుడే.. కానీ.. వైఎస్సార్పీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

అతనిని పోలీస్ స్టేషన్‌లో కొడుతూ తనకు వీడియో కాల్‌లో చూపించారని చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రజిని మండిపడ్డారు. చంద్రబాబు ప్రచారం గోబెల్స్‌ను మించిపోయిందని ఆమె ధ్వజమెత్తారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కనీస వాస్తవాలు తెలుసుకోకుండా బీసీ మహిళనైన తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: బహిరంగ చర్చకు సిద్ధమా బాబూ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సవాల్

మహిళపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని రజిని అన్నారు. మీ ఇంట్లో మహిళపై కూడా ఇలానే దుష్ప్రచారం చేస్తే ఊరుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, ప్రత్తిపాటి పుల్లారావు ఈ ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. నిరూపించలేకపోతే వాళ్లు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. దమ్ముంటే సవాల్ స్వీకరించాలని లేకుంటే క్షమాపణ చెప్పాలని రజిని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.