యాప్నగరం

Virat Kohli ప్రకటనపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఎమోషనల్.. ఇలాంటి వార్త వినాలనుకోవట్లేదంటూ..!

టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలగడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఎమోషనల్!

Samayam Telugu 16 Jan 2022, 11:19 am
వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే వన్డే, టీ ట్వంటీ ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీ.. తాజాగా, టెస్టుల్లో కెప్టెన్సీని కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ప్రకటించగా.. దేశ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
Samayam Telugu విరాట్ కోహ్లీ, ఎమ్మెల్యే విడదల రజిని



ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని ఎమోషనల్ అయ్యారు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి వార్తను కచ్చితంగా ఇప్పుడు తాము వినాలనుకోలేదని ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు. కానీ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు. భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అందించిన సేవలకు ఎమ్మెల్యే విడదల రజిని ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడిగా బాగా రాణించాలని.. సెంచరీల మీద సెంచరీలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే రజిని ట్వీట్ చేశారు.

కాగా, 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నియమితులయ్యారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టెస్టులకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ అకస్మాత్తుగా ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆటగాడిగా రాణించి అవమానించిన వారికి గుణపాఠం చెప్పాలంటూ విరాట్ కోహ్లీకి అండగా నిలబడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.