యాప్నగరం

ఆయన్ని చూస్తే అబద్ధానికి కూడా సిగ్గేస్తుంది! మహిళా ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

గాంధీ జయంతి రోజున కూడా మద్యం విక్రయాలు చేశారని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు. టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారింది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ మద్యం షాపులు తెరిచే ఉండేవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజిని విమర్శించారు.

Samayam Telugu 3 Oct 2019, 6:19 pm
మహాత్ముడి జయంతి రోజున కూడా మద్యం అమ్మకాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజున కూడా మద్యం విక్రయాలు చేశారని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. గాంధీ జయంతి రోజున మద్యం అమ్ముతున్నారని, పోలీసుల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారని వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అసత్యం చంద్రబాబు నైజమని, అలాంటి వారిని చూసి అబద్ధం కూడా సిగ్గుపడుతుందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారో అర్థంకావడం లేదన్నారు.
Samayam Telugu chandrababu2


మద్యం విక్రయాలు జరిగితే ఆయన నిరూపించాలని సవాల్ చేశారు. ఎక్కడ కనిపించింది? మద్యం విక్రయాలు ఎక్కడ జరిగాయో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారిందని, ఉదయం, రాత్రి తేడా లేకుండా మద్యం షాపులు తెరిచే ఉండేవన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే వీధికొకటి చొప్పున 43 వేల బెల్టు షాపులు మూసివేశారన్నారు. జగన్ పాలనలో మద్యం షాపులు 20 శాతం తగ్గాయన్నారు. మద్యం షాపులను 3500కు పరిమితం చేశారని, సమయం కూడా తగ్గించారన్నారు.

Also Read: లాంతర్ల బిజినెస్ మొదలెట్టేశావా! ఎంపీ విజయసాయిపై టీడీపీ నేత సెటైర్లు

స్వచ్ఛమైన పరిపాలన కోసం మహాత్మ గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పించారన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం, మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు సచివాలయాలను ప్రారంభించారన్నారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంటే ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: అదీ బాబు పాద మహిమ! విజయసాయి ఘాటు విమర్శలు

గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ నానా యాగీ చేస్తున్నారని, ఎలాంటి రికమండేషన్లు లేకుండా అభ్యర్థులు ఉద్యోగాలు తెచ్చుకుంటే తప్పులు జరిగాయని మాట్లాడడం తగదని రజిని అన్నారు. చంద్రబాబుకు గ్రామ స్థాయిలో సమస్యలు తెలియవని, ఆయన హైటెక్ చంద్రబాబంటూ ఎద్దేవా చేశారు. అనవసరంగా స్థాయి దిగజార్చుకుని బజారున పడొద్దని హితవు పలికారు. అసత్య ప్రచారానికి పాల్పడుతున్న చంద్రబాబును చట్టపరంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.